calender_icon.png 19 June, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డిసిసి ఉపాధ్యక్షులు చొప్పరి

18-06-2025 09:40:19 PM

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెల్కల కాంతయ్య ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని పెద్దపల్లి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం(Former ZPTC Choppari Sadanandam) పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి, మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని నివాళులర్పించారు. ఆయన వెంట పోతారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్ర మల్లయ్య, ఎంపీటీసీలు చెల్కల సుధీర్, బండ సమ్మయ్య, చెల్కల ఓదేలు, నరేందర్, కిషన్, బత్తుల రాజయ్య, మల్లయ్య, నాంసాని రమేష్, మొగిలి, అనిల్, గట్టయ్య తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.