02-06-2025 12:29:19 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూన్ 1(విజయక్రాంతి): మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జూన్ 2వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీవో రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్, కలెక్టరేట్ ఏవో యూనస్, సంబంధిత ఇతర అధికారులు సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా జెండా ఆవిష్కరణ , ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రసంగం, శకటాల ప్రదర్శన, ప్రముఖులు, మీడియా, అతిథుల కోసం ఏర్పాటు చేసే సీటింగ్ గ్యాలరీ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. డయాస్, అలంకరణ, మైక్, స్పీకర్స్, తాగునీరు, తదితరాలపై పలు సూచనలు చేశారు.
జిల్లా విద్యాశాఖ ద్వారా సాంస్కృతిక ప్రదర్శనలు, పోలీసుల గౌరవ వందనం, బ్యాండ్, బందోబస్తుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వేడుకలు అట్టహాసంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, ఇతర సంబంధిత అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.