calender_icon.png 6 June, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్కడ చూసినా రోడ్లపై ధాన్యం రాశులు, రైతన్న గోసలు

03-06-2025 12:25:46 AM

బీ ఆర్‌ఎస్  జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

నిజామాబాద్ జూన్ 2:(విజయ క్రాంతి): కేసీఆర్ నైజం  జైతెలంగాణ అయితే రేవంత్ ఇజం నైతెలంగాణ అని బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీ ఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  కేసీఆర్ రూపం తెలంగాణ చిత్రపటం అని అభివర్ణించారు. కేసీఆర్ అంటే ప్రతీఇంట్లో సంక్షేమం, ప్రతీ కంట్లోసంతోషమని, కాంగ్రెస్ అంటే ప్రతీ ఇంట్లో సంక్షోభం,ప్రతీ కంట్లో విషాదమని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదా? అని నిలదీశారు. పండిన పంటలు కొనవా?, రైతుల గోడు వినవా?.

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా?, దీన్నే ప్రజా పాలన అంటారా?. ఎక్కడ చూసినా రోడ్లపై ధాన్యం రాసులు, రైతన్న గోసలు కనిపిస్తుంటే  అందాల పోటీల్లో మునిగిపోయారా?.రైతు భరోసా ఏమైంది,! రైతు రుణమాఫీ తొండి చేసిండ్రు. నా చెల్లెళ్ళకు ఇస్తానన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ఇస్తానన్న తులం బంగారం ఏమైంది,అని   జీవన్ రెడ్డి ప్రశ్నించారు. 

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్,మాజీ జెడ్పీ ఛైర్మన్ విఠల్ రావు,మాజీ నగర మేయర్ నీతు కిరణ్,బాజిరెడ్డి జగన్,ప్రభాకర్ రెడ్డి,బిఆర్‌ఎస్ పార్టీ మండల,పట్టణ,గ్రామ శాఖ అధ్యక్షులు,మాజీ జెడ్పీటీసిలు,మాజీ ఎంపిపిలు,మాజీ సర్పంచులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.