03-06-2025 12:25:55 AM
గద్వాల, జూన్ 2 (విజయక్రాంతి): జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వికలాంగులకు కొత్త సర్టిఫికెట్ లు, రెన్యువల్ కొరకు సద రం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నర్సింగరావు సోమవారం ప్రకటనలో తెలిపారు. సదరం క్యాంప్ లు ప్రతి మంగళ, బుధ,గురు మరియు శుక్ర వారాలలో జూన్ నెల మొత్తం నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. అర్హత గల వికలాంగులు సర్టిఫికెట్స్ కొత్తవి పొందడానికి ముందే మీసేవ కేంద్రాలలో సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అన్నారు.
బుకింగ్ చేసుకున్నవారు ని ర్ణయించిన తేదీలలో ప్రభుత్వ హాస్పిటల్ నం దు వారికి సంబంధించిన రిపోరట్స్మరియు కొత్తగా తీసిన ఎక్సరే, ఆధార్ కార్డు తీసుకొని హాజరు కావాలని లేనియెడల తిరస్కరించబడునని సూచించారు. హాజరైన వారికి అదే రోజు సదరం సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు ఆయ న తెలిపారు.
ఈ క్యాంప్ లు ఈ నెల 03,10, 17, 24 తేదీలలో ప్రతి మంగళవారాలు,కం టి వికలత్వం గల వారికి, తేది 04,11,18,25 బుధవారాలు శారీరక వికలత్వం గల వారికి, తేదీ 05,12,19,26గురువారం శారీరక మా నసిక వికలత్వం వారికి, తేదీ 06, 13, 20, 27 శుక్రవారాలలోచెవిటి, మూగ వికలత్వం గలవారికి క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆయ న ప్రకటన ద్వారా తెలిపారు.