03-06-2025 12:23:12 AM
- రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- గ్రామాలలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
- పారదర్శకంగా సంక్షేమ పథకాల అమలు
- తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, జూన్ 2 (విజయక్రాంతి): పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.సోమవారం మంత్రి, తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
తిరుమలాయపాలెం మండలంలోని రఘునాథ పాలెం గ్రామంలో బీటీ, సీసీ రో డ్డు, సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు, గోల్ తం డా, దమ్మాయిగూడెం గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు, గోపాలపురం, చింతపల్లి స్టేజి గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనుల కు, కొక్కిరేణి గ్రామంలో జెడ్.పి.హెచ్.ఎస్. పాఠశాలలో అదనపు తరగతి గదులు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతగా భావి స్తూ పాలన సాగిస్తుందని అన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, పే ద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాల్ కు 500 రూ పాయల బోనస్, సన్న బియ్యం సరఫరా, రా ష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.
గ్రామాలలో సిసి రోడ్లు వేస్తున్నామని అన్నా రు.తరతరాల నుండి మనకు ఉన్న ఆస్తుల పట్ల గత ప్రభుత్వం ధరణి పేరుతో అభద్రత కల్పించిందని, రైతులకు ఉన్న భూ సమస్యలను అధికారులు నేరుగా గ్రామాలకు వచ్చి పరిష్కరించి భూ భద్రత కల్పించే దిశగా భూ భారతి చట్టం ద్వారా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం మన మీ ద అప్పుల భారం పెట్టినప్పటికీ ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అ న్నారు.
ప్రతి గ్రామం, మండలంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి పనులు సైతం చేపట్టామని, పేదలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఇ యాకుబ్, వివిధ శాఖల అధికారు లు, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.