16 April, 2026 | 11:55 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

విభిన్న రంగాల్లో మహిళలకు చక్కటి ఆదాయ మార్గాలు

07-02-2026 12:39 AM
  1. కాకినాడలో కరీంనగర్ మహిళలకు అలంకరణ చేపల పెంపకం పై శిక్షణ

అభినందించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి): మహిళలు విభిన్న రంగాల్లో ఉపాధి మార్గాలను ఎం చుకుని ఆర్థిక సాధికారత సాధించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా మత్స్యశాఖ సహకారంతో కరీంనగర్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన 19 మంది సభ్యులు అలంకరణ చేపల పెంపకం, ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో గల రా ష్ట్ర ఫిషరీస్ టెక్నాలజీ సంస్థలో మూడు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని క్యాంపు కార్యాలయంలో కలిసి స్వయంగా తయారు చేసిన అక్వేరియం, అలంకరణ చేపను అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మహిళలు కొన్ని రంగాలను మాత్రమే ఉపాధి మార్గాలుగా ఎంచుకుంటున్నారని, దీనివల్ల పోటీ ఎక్కువగా ఉంటుందని అన్నారు. విభిన్న రంగాల్లో చక్కటి ఉపాధి, ఆదాయ మార్గాలు ఎన్నో ఉ న్నాయని తెలిపారు.

అలంకరణ చేపల ఉత్పత్తి, పెంపకంలో మంచి డిమాండ్ ఉన్నందున కరీంనగర్ జిల్లా మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులను ఆంధ్రప్రదేశ్లోని కాకినా డలో శిక్షణకు పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ భార తి, ఫీల్ ఆఫీసర్ అశోక్, ఎఫ్.డి.ఓ మంజుల పాల్గొన్నారు.