07-02-2026 12:39:28 AM
అభినందించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి): మహిళలు విభిన్న రంగాల్లో ఉపాధి మార్గాలను ఎం చుకుని ఆర్థిక సాధికారత సాధించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా మత్స్యశాఖ సహకారంతో కరీంనగర్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన 19 మంది సభ్యులు అలంకరణ చేపల పెంపకం, ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో గల రా ష్ట్ర ఫిషరీస్ టెక్నాలజీ సంస్థలో మూడు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని క్యాంపు కార్యాలయంలో కలిసి స్వయంగా తయారు చేసిన అక్వేరియం, అలంకరణ చేపను అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మహిళలు కొన్ని రంగాలను మాత్రమే ఉపాధి మార్గాలుగా ఎంచుకుంటున్నారని, దీనివల్ల పోటీ ఎక్కువగా ఉంటుందని అన్నారు. విభిన్న రంగాల్లో చక్కటి ఉపాధి, ఆదాయ మార్గాలు ఎన్నో ఉ న్నాయని తెలిపారు.
అలంకరణ చేపల ఉత్పత్తి, పెంపకంలో మంచి డిమాండ్ ఉన్నందున కరీంనగర్ జిల్లా మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులను ఆంధ్రప్రదేశ్లోని కాకినా డలో శిక్షణకు పంపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ భార తి, ఫీల్ ఆఫీసర్ అశోక్, ఎఫ్.డి.ఓ మంజుల పాల్గొన్నారు.