10-06-2025 12:56:33 AM
బీజేపీ పట్టణ అధ్యక్షుడు సురేష్
కామారెడ్డి, జూన్ 9 (విజయ క్రాంతి), దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని బిబిపేట పట్టణ బిజెపి అధ్యక్షులు సురేష్ అన్నారు. సోమవారం బీబీపేట పట్టణ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రధానిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా సోమవారం బీబీపేట పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించామని అన్నారు.
నేరేంద్ర మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు చిట్ట చివరి వ్యక్తికి ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా చేరుతున్నాయని అన్నారు. అన్నదాతలకు అండగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించిందని అన్నారు. భారత్ ను విశ్వగురువుగా తీర్చిదిద్దే క్రమంలో మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రతి బీజేపీ కార్యకర్త అండగా ఉండాలని అన్నారు. బి బి పేట పట్టణ మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.