calender_icon.png 10 June, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెక్కన్ పామ్ రెస్టారెంట్‌లో డిప్యూటీ మేయర్ ఆకస్మిక తనిఖీలు

10-06-2025 12:57:10 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (విజయక్రాంతి): తార్నాక చౌరస్తాలో ఉన్న డెక్క న్ పామ్ రెస్టారెంట్‌లో కుళ్లిన చికెన్‌ను వాడి చేసిన బిర్యానీని ప్రజలకు అందిస్తున్న విషయాన్ని తెలుసుకున్న గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ సోమవారం రెస్టారెంట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

అహైజినిక్ ఆహార పదార్థాలను గుర్తించి, రెస్టారెంట్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులతో మాట్లాడిన ఆమె, డెక్కన్ పామ్ రెస్టారెంట్‌లో వాడుతున్న నాన్-హైజినిక్ పదార్థాలపై పరీక్షలు నిర్వహించి,  కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. ఆహార నాణ్యతను పాటించని సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నగర ప్రజల ఆరోగ్యం, భద్రతకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు తగిన నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోని అన్ని రెస్టారెంట్లు, హోటల్స్, టిఫిన్ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.