18-05-2025 12:43:57 AM
తెలంగాణలో యాసంగి కోతలు ముగిశాయి. రైతులు ఇక వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. రైతాం గం అవసరాలకు తగినట్లుగా వ్యవసాయశాఖ ఎరువులు, విత్తనాలు సమకూర్చేం దుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సైతం సిద్ధం చేసింది. ఈ నెలలో నాలుగో వారం నుంచి సీజన్ ప్రా రంభం కానున్నది.
రైతులు ఇప్పటికే దు క్కులను దున్నుకుని సిద్ధం చేసుకున్నారు. ఈ నెలాఖరులోనే నైరుతి రుతు పవనాలు తొందరగా ఆగమించడంతో తెలంగాణ లో వర్షాలు సైతం ముందుగానే కురిసే అ వకాశాలు ఉన్నాయి. యాసంగిలో సాగు విస్తీర్ణం తక్కువే అయినప్పటికీ.. వానకాలంలో మాత్రం సాగు విస్తీర్ణం అమాంతం పెరుగుతుంది.
ఈ సీజన్లో రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా పంటలు సాగవుతా యి. ఇదంతా ఒకవైపు అయితే.. ఇక వ్యవసాయ సీజన్ షురూ అయిందంటే అక్ర మార్కులు నిద్ర లేస్తారు. రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలనుకునే ముఠాలు కాచుకుని కూర్చుంటా యి. కొందరు డీలర్లు ప్రజా ప్రతినిధుల అండ దండలతో నకిలీ విత్తన దందాకు పాల్పడుతున్నారు. కొందరిపై పీడీ యాక్టు లు నమోదైనా నకిలీ విత్తన ముఠాల ఆగడాలు ఆగడం లేదు. సర్కార్ యేటా తీసు కుంటున్న చర్యల్లో భాగంగానే ఈసారి కూడా నకిలీ విత్తనాల కట్టడిపై వ్యవసా య, పోలీస్, రెవెన్యూశాఖలను అప్రమత్తం చేస్తున్నది.
బీటీ విత్తనాల పేరుతో బీటీ విత్తనాల విక్రయం..
అమెరికాలోని ‘మోనో శాంటో’ కంపెనీ ఉత్పత్తి చేసిన బీటీ రకం పత్తి విత్తనాలపై దేశవ్యాప్తంగా నిషేధం ఉంది. ఈ విత్త నాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. బీటీ బీటీ రకాలకు మాత్రమే భారత్లో అనుమతి ఉంది. ప్రస్తుతం మన దేశంలో ఈ రెండు రకాల విత్తనాలను 20 ప్రధాన కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ.. నిషేధిత బీటీ విత్తన ఉత్పత్తి అనేది భారత్లో లేనే లేదు. కాని.. డబ్బుకు ఆశపడిన కొందరు అక్రమార్కు లు అక్రమమైన మార్గంలో బీటీp విత్తనాలను సేకరించి, వాటినే బీటీ విత్తనాలు.. అని రైతుల నమ్మించి నట్టేట ముంచుతున్నారు. వీటి వెనక జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బీటీ విత్తనాల వెనుక కథ..
ఎదుగున్న పత్తి పంటను ఆశించే శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీరంగు పురుగును నివారించేందు కు అమెరికాకు చెందిన మోన్శాంటో అనే కంపెనీ బాసిల్లస్ తుర్కింజియెన్సిస్ (బీటీ) అనే టెక్నాలజీని ప్రవేశపెట్టింది. 2002లో తొలిసారిగా బీటీ పత్తి విత్తనాలను విపణిలో పెట్టింది. ఆ రకం విత్తనాలు 2006 వరకు చీడపీడలను నివారించింది. కాలక్రమేణా చీడపీడలు బీటీఝై విత్తనాలు మళ్లీ నాశనం చేయడం మొదలు పెట్టాయి. రైతులు నష్టపోవడం మొదలైంది.
తర్వాత అదే కంపెనీ బీటీ విత్తనాల ఉత్పత్తి ప్రా రంభించింది. 2012లో వాటి విక్రయాలు షురూ చేసింది. ఆ రకం చీడపీడలను తట్టుకుని నిలబడింది. తర్వాత ఇదే కంపెనీ మళ్లీ బీటీd రకం విత్తనాల ఉత్పత్తి ప్రా రంభించింది. ఈ విత్తనాలను ల్యాబుల్లో పరీక్షించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ విత్తనాలతో పర్యావరణానికి హాని కలుగుతుం దని గుర్తించి, ఆ రకం విత్తన విక్రయాలను భారత్లో నిషేధించింది.
కానీ.. మన దేశానికి చెందిన అనేక కంపెనీలు అమెరికా నుంచి దొడ్డిదారిన తక్కువ ధరకు బీటీ రకం విత్తనాలను తీసుకువచ్చి, ప్రత్యేకంగా మధ్యవర్తులు, ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నాయి. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా రైతులు పత్తి పండిస్తారు. ఆయా జిల్లాల్లో పండే పత్తిలో ఏటా 30శాతం బీటీ రకం పత్తే పండుతుందని ఒక అంచనా ఉంది.
ఆంధ్రా నుంచి రవాణా..
ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల, తెలంగాణ పరిధిలోని నాగార్జున సాగర్ సరిహద్దు నుంచే అక్రమార్కులు బీటీహొ విత్తనాలను తెలంగాణలోకి తీసుకువస్తున్నారనేది గతంలో అనేకసార్లు బయటపడింది. ఆం ధ్రానే కాకుండా కర్ణాటక, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర నుంచి కూడా కొంత వర కు బీటీ విత్తనాలు వస్తున్నాయి. అడపాదడపా వ్యవసాయశాఖ అధికారులు టాస్క్ఫోర్స్తో కలిసి చేసిన దాడుల్లో విత్తనాల అక్రమ రవాణా బాగోతం బయట పడుతున్నది.
మామూలుగా అయితే రైతులకు ఇచ్చే విత్తనాలు, ఎరువులకు డీలర్లు, వ్యాపారులు బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. కొందరు తక్కువ ధరకు విత్తనాలు, ఎరువులు ఇస్తున్నామని చెప్పి, రైతులను మభ్యపెట్టి రశీదులు ఇవ్వడం లేదు. రశీదులు ఉంటే తర్వాత పంట నాశనమైన తర్వాత రైతులు వచ్చి నిలదీస్తారనే డీలర్లు, వ్యాపారులు రశీదులు ఇవ్వకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. నకిలీ విత్తనా లు నాటి నష్టపోతున్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు సైతం గతం లో అనేకం ఉన్నాయి.
నిఘా కళ్లుగప్పి కొత్త మార్గాలు..
రోడ్డు మార్గం ద్వారా విత్తనాలు తరలిస్తే ఎక్కడ వాహనం, సరుకు పట్టుబ డుతుందోనని అక్రమార్కులు ఆ వి ధమైన రవాణాను పక్కన పెడుతున్నారు. నకిలీ విత్తనాలను అందమైన, ఆకర్షణీయమైన అట్టపెట్టెలు, ఫాలిథిన్ బ్యాగుల్లో ప్యాక్ చేసి గుట్టుచప్పుడు కాకుండా చిన్నమొత్తంలో రైళ్లలో తరలిస్తున్నారు.
ఇంకా తెలివిమీరిన అక్రమార్కులైతే ఏకంగా ట్రాన్స్పోర్ట్ సంస్థలను వినియోగించుకుంటున్నారు. ఒకవేళ వ్యవసాయశాఖ, విజిలె న్స్, టాస్క్ఫోర్స్ బృందాలు ట్రాన్స్పోర్ట్ వాహనాలను తని ఖీ చేసినా.. ఆ బృందాలకు ఏ సంచిలో ఏముందో.. ఏ బ్యాగులో ఏం సరుకు ఉం దో.. అని తెలుసుకునేంత వెసులుబాటు ఉండదు. అలా బృందాల తనిఖీలు దాటి నకిలీ విత్తనాలు సరిహద్దులు దాటుతున్నాయి. డీలర్లు, వ్యాపారులు వాటిని అమ్మడానికి ఎన్నో జిమ్మిక్కులు ప్రయోగిస్తారు.
అది ఎలానంటే.. ‘ఫలానా కంపెనీ విత్తనాలు పది ప్యాకెట్లు కొంటే మూడు ప్యాకెట్లు ఉచితం’ అంటూ ఏజెంట్లు రైతులకు అరచేతి లో వైకుంఠం చూపిస్తారు. అంతేనా.. కొం దరు డీలర్లయితే విత్తనాల కోసం వచ్చిన రైతులకు మంచి భోజనం పెడుతున్నారు. ఎక్కువ మంది రైతులను వెంటబెట్టుకుని వచ్చే మోతుబరులకు తాయిలాలు అందిస్తున్నారు. కాబట్టి రైతు లు విత్తనాలు, ఎరు వుల కోనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆచితూచి వాటిని కొనుగోలు చేయాలి. కొన్న విత్తనాలకు కచ్చితంగా బిల్లు తీసుకోవాలి.
లైసెన్సు ఉన్న విత్తనాలు విక్రయించే డీలర్లు, వ్యాపారుల వద్దే కొనాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దళారుల వద్ద విత్తనాలు కొనవద్దు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడితే, వారికి న్యాయస్థానం ఏడేండ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకూ జరిమానా కూడా విధించవచ్చు.
ఒకటికి రెండుసార్లు, మూ డుసార్లు నకిలీ విత్తనాలు విక్రయించి పట్టుబడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయవచ్చని చట్టాలు చెప్తున్నాయి. ప్రభుత్వం అలాంటి వారిని ఉపేక్షించకుండా, పీడీ యాక్టులు నమోదు చేస్తే, మిగిలిన అక్రమార్కుల్లో వణుకుపు డుతుంది. తద్వారా నకిలీ విత్తనాల విక్ర యం కొంతవరకే తగ్గే అవకాశం ఉంది. వానకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ ‘పీడీ’కిలి బిగించా ల్సిన అవసరం ఉంది.
వ్యాసకర్త సెల్ నెంబర్ 98484 45134