18-05-2025 12:41:53 AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేయబోతున్నది. నేటి ఉదయం ౫:59 గంటలకు ఏపీలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (శ్రీహరికోట) నుంచి తన 101వ ఉప గ్రహమైన ‘ఈవోఎస్- 09’ను ‘పీఎస్ఎల్వీసీ రాకెట్ సాయంతో 529 కిలోమీటర్ల ఎత్తులో గల అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నది. ఈవోఎస్ అంటే ‘ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్’ అని అర్థం.
ఈ ఉపగ్రహం ద్వారా దేశ సరిహద్దులు, తీర ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలు, ఉగ్రవాద కార్యకలాపాలను భారత్ కచ్చితంగా గుర్తించేందుకు మార్గం సుగమం అవుతుంది. రాత్రీ పగలు, ప్రతికూల వాతావరణాలతో సంబంధం లేకుం డా ఉపగ్రహం భారత భూభాగంపై నిఘా వే స్తుంది. గూఢచారిలా వ్యవహరించి ము ష్కరుల గుట్టు రట్టు చేస్తుంది. ఇక నుంచి పాక్ సరిహద్దుల్లో అనుమానాస్పద కదలికలను సులభంగా గుర్తించవచ్చన్న మాట.
పహల్గాం దాడుల తర్వాత..
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ముష్కరుల దాడి చేసి 26 మంది భారత్కు చెందిన పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. అందుకు ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టి పాకిస్థాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమ ట్టం చేసింది. దాడులతో సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టిం ది. తదనంతరం భారత సైన్యం విజృంభించి పాకిస్థాన్ మిలటరీతో పాటు పాక్ ప్రభుత్వానికీ ముచ్చెమటలు పట్టించింది. కొన్ని మిలటరీ స్థావరాలపై దాడి చేసింది.
ఆ తర్వాతి పరిణామాలు రెండు వైపులా కాల్పుల విరమణకు దారి తీసింది. ఆ తర్వాత ఉగ్రవాదులను ఉపేక్షించబోమని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు ఇస్రో సాయంతో సర్కార్ ‘ఈవోఎస్- 09’ అనే అంతరిక్ష గూఢచారిని రంగంలోకి దించుతున్నది. ఈ ఉపగ్రహం అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద కదలికలను పసిగట్టనున్నది.
తీరప్రాంతాల్లో స్మగ్లింగ్ కార్యకలాపాలను కట్టడి చేసే విషయంలోనూ తోడ్పడనున్నది. ఇస్రో ఈ ఉపగ్రహ తయారీకి అత్యాధునిక ‘సీ-బ్యాం డ్ సింథటిక్ ఎపర్చర్ రాజార్ టెక్నాలజీ’ని వినియోగించింది. ఉపగ్రహం అంతరిక్షం నుంచి చీకటీ వెలుతురు అనే తేడా లేకుం డా అని సమయాల్లోనూ ఒకే విధంగా భారత సరిహద్దులను పర్యవేక్షించనున్నది. అంతేకాదు.. ఉపగ్రహ సహకారంతో ప్రకృ తి విపత్తులకు సంబంధించిన సమాచారా న్ని ముందే తెలుసుకునే అవకాశం ఉంది.
ప్రతికూల వాతావరణంలోనూ నిఘా..
ఇప్పటికీ ఇస్రో అనేక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. వాటి సరసన మరో రాడార్ ఇమేజింగ్ ఉప్రగహంగా ‘ఈఓఎస్ -09’ చేరనున్నది. సాధారణంగా ఉగ్రవాదులు రాత్రిళ్లు, వర్షాలు కురిసినప్పుడు, కారు మబ్బులు కమ్మినప్పుడు దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తారు. వారి కదలికలను ఈ ఉపగ్రహం హై రెజల్యూషన్ కెమెరాలతో స్పష్టంగా ఫొటోలు తీయగలదు. సుమారు 1,౬౯౬.౨౪ కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహానికి స్పష్టమైన చిత్రాలు తీయగలిగే సామర్థ్యం ఉంది.
వ్యూహాత్మక ప్రయోజనాలు..
ప్రయోగంపై ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ మాట్లాడుతూ.. దేశ భద్రత కోసం ప్రస్తుతం 10 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. 7,000 కిలోమీటర్ల మేర సరిహ ద్దు భూభాగంపై నిఘా పెట్టాయని, కీలకమైన నిఘా డేటాను అందించడం ద్వారా పౌరులను రక్షించడంలో ఈ ఉపగ్రహాలు వ్యూహాత్మక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
‘మన దేశ భద్రతను నిర్ధారిం చుకో వాలంటే, మన ఉపగ్రహాల ద్వారా సేవలందించాలి. మన సముద్ర తీర ప్రాం తాలను మనం పర్యవేక్షించాలి. మ నం మొత్తం ఉత్తర భాగాన్ని నిరంతరం పర్యవేక్షించాలి’ అని అభిప్రాయపడ్డారు. శాటిలై ట్లు, డ్రోన్ టెక్నాలజీ లేకుండా భారతదేశం రక్షణలో ఉన్నట్లు కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇస్రో మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదన్నారు.
భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్రో ఉపగ్రహ నిఘా మరింత కీలకంగా మారుతోంది. సరిహద్దు ఘర్షణల ముప్పు, రియల్-టైమ్ ఇంటెలిజెన్స్ అవసరం దృ ష్ట్యా, అంతరిక్ష ఆధారిత పర్యవేక్షణ భారతదేశానికి వ్యూ హాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ఉపగ్రహాలు అందించే Continuous surveillance, along the borders, at seaలో ఏవైనా శత్రు కార్యకలాపాల పట్ల సాయు ధ దళా లు అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. భౌగోళిక రాజకీయ సవాళ్లు కొనసాగుతున్నందున, ఉపగ్రహం, డ్రోన్ సాం కేతికతలో భారతదేశం పెట్టుబడి పెట్టడం దేశ రక్షణను బలోపేతం చేయడమే కాకుం డా, ప్రత్యర్థులకు సంసిద్ధత, సాంకేతిక సామర్థ్యం గురించి స్పష్టమైన సందేశాన్ని కూడా పంపుతుంది.
వ్యాసకర్త సెల్ నెంబర్ 99497 00037