9 April, 2026 | 8:25 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

అభివృద్ధిపై తప్పుడు ప్రచారం మానుకోవాలి

07-02-2025 05:06 PM

బిజెపి జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు మంజూరు అయినా నిధులపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం హెచ్చరించారు. శుక్రవారం కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఇటీవల 10 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ నిధుల మంజూరుకు ఎమ్మెల్యే కృషి చేస్తే ఎమ్మెల్సీ కృషి వల్లే విడుదల అయ్యాయని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఎమ్మెల్యే గత ఏడాది డిసెంబర్ లో ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీకి పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలో పంపించారని లేఖని చూపించారు. నిధులు మంజూరైన తర్వాత ఎవరికో పుట్టిన పిల్లలను తమ పిల్లలుగా చెప్పుకునే విధంగా కాంగ్రెస్ నాయకుల తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే హరీష్ బాబు అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని దీనిని సహించని కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.