9 April, 2026 | 10:13 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

07-02-2025 05:03 PM

చెన్నూర్ (విజయక్రాంతి): చెన్నూర్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని శుక్రవారం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డయేరియాతో బాధపడుతున్న రోగులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మున్సిపాలిటీలో తాగునీరు సమస్యను పరిష్కరించాలని, బట్టిగూడెం, జెండావాడలో మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందిస్తున్నామని, బోనాల జాతరతో నీళ్లు కలుషితం కావడం వల్లనే వాంతులు, విరోచనాలతో ప్రజలు బాధ పడుతున్నారన్నారు. బతుకమ్మ వాగు నుంచి కాకుండా గోదావరి నీళ్లు వచ్చేలా చూస్తున్నామని, అమృత్ పథకంతో నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంపై కలెక్టర్ తో మాట్లాడి నిధులు కేటాయించి సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.