21 July, 2026 | 9:14 PM

Breaking News

తెలంగాణలో తదుపరి ప్రభుత్వం బీజేపీదే: చంద్రశేఖర్ తివారి   •   ఐటీఐ-ఏటీసీ విద్యార్థులు ప్రైవేట్ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి   •   దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం...   •   దుబాయ్‌లో బోనాల ఉత్సవాలు   •   ఎమ్మెల్యే నాయినికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు పొంగులేటి, పొన్నం   •   వర్షంలోనూ పారిశుధ్య పనుల్లో ఉపసర్పంచ్   •   ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషం   •   ఎల్ నీనో ప్రభావం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఖర్గే జన్మదిన వేడుకలు   •   బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల వల్లే మేడ్చల్ ప్రజలకు కష్టాలు   •  

సులానగర్ పీహెచ్‌సీలో బదిలీ ఉద్యోగులకు ఘన వీడ్కోలు

21-07-2026 06:37 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ఆరోగ్య శాఖ ఉద్యోగులకు మంగళవారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై ఆరోగ్య విస్తరణాధికారి దేవా, సూపర్వైజర్లు ఫోరండ్ల శ్రీనివాస్, నాగుబండి వెంకటేశ్వర్లు, ల్యాబ్ టెక్నీషియన్ రాజు, ఏఎన్‌ఎంలు లలిత, ఎల్లమ్మ, నాగలక్ష్మి, రమాకుమారి, సుజాత, మానసతో పాటు బదిలీపై వెళ్తున్న ఆరోగ్య శాఖ సిబ్బందిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ.. సులానగర్ పీహెచ్‌సీలో ఉద్యోగులు అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కొత్త బాధ్యతల్లోనూ ఇదే అంకితభావంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. సహోద్యోగులు బదిలీపై వెళ్తున్న ఉద్యోగుల సేవలను గుర్తు చేసుకుంటూ అభినందనలు తెలిపారు. స్పందించిన ఉద్యోగులు సులానగర్‌లో పనిచేసిన రోజులు తమకు చిరస్మరణీయమని, సహచరుల సహకారాన్ని ఎప్పటికీ మరువబోమని పేర్కొన్నారు.