విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం అమానుషం
బోథ్,(విజయక్రాంతి): ఢిల్లీలో శాంతియుతంగా పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులపై పోలీసులు నాటించాల్సి టీఆర్ఎస్ ప్రయోగం చేయడం మాయని మచ్చ అని ప్రభుత్వం వెంటనే విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధి పశుల చంటి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై వెంటనే చర్య తీసుకోవాలని, అంతేగాక కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన బర్తరస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వానికి ప్రజలు తమ గుణపాఠం చెప్తారన్నారు.పరీక్ష వ్యవస్థను బలోపేతం చేయాలని పరీక్షల నిర్వహణలో పారదర్శకతను జవాబుదారితనాన్ని సాంకేతిక భద్రతను పెంచాలని ఆయన కోరారు.తక్షణమే కేంద్ర ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.






