18 August, 2026 | 12:23 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం

18-08-2026 11:49 AM

వరంగల్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స

జనగామ,(విజయక్రాంతి): తరిగొప్పుల మండలం బొంతగట్టు నగరం గ్రామానికి చెందిన రైతు పిల్లి రవి కుమార్ రోడ్డు నిర్మాణం కారణంగా తన పొలం కోల్పోతాననే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేందుకు రైతులందరూ కలిసి ఒక బాటను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ బాటలోనే బీటీ రోడ్డు వేస్తుండటంతో 15-20 గుంటల భూమి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కువగా నష్టపోతున్నది తానేనని రవి కుమార్ ఆవేదన చెందాడు.

మానసిక క్షోభతో ఆత్మహత్యాయత్నం చేసిన రవి కుమార్‌ను కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. రైతులకు ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా రోడ్డు వేయడంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.