ఫర్నిచర్ షాప్లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం
18-08-2026 12:15 PM
సిరిసిల్ల,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దూరు శివారులో మహాలక్ష్మి ఫర్నిచర్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక కార్మికుడు సజీవదహనమయ్యాడు. రాత్రి దుకాణంలో నిద్రించిన ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఒక వలస కార్మికుడు మృతి చెందాడు. దుకాణంలో ఉన్న బెడ్లు, సోఫాలు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ. 40 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచన. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో దాదాపు మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.






