21 April, 2026 | 3:16 PM

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

06-06-2025 01:01 AM

సదాశివపేట, జూన్ 5 :సదాశివపేట మండలం మెలిగిరి పేట గ్రామానికి చెందిన రాజారెడ్డి (48) గురువారం ఉదయం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు కథనం.. గురువారం ఉదయం తన సొంత పొలంలో డైరీ ఫాం ఉన్నందున పశువులకు మేత కోయడానికని వెళ్ళాడు,

ఆ క్రమంలో విద్యుత్ బోరుకు సరఫరా అవుతున్న సర్వీస్ వైర్ ప్రమాదవశాత్తు తెగి అతనిపై పడడంతో విద్యుత్ షాక్ కు గురికావడంతో  రాజారెడ్డిని చుట్టు పక్కల వారి సహకారంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు నిర్ధారించిచెప్పారు.