06-06-2025 01:02:05 AM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కులను పంపిణి చేసిన ప్రభుత్వ విప్
వేములవాడ జూన్, 5 (విజయక్రాంతి): ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్ర జా ప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అ న్నారు..వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన 65 మంది లబ్ధదారులకు 28 లక్షల 48 వేల విలువ గల ముఖ్యమం త్రి సహాయ నిది చెక్కులను బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
వారు మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారిందన్నారు.. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి,ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు.
మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార, ఎల్ఓసి ల ద్వారా ఇప్పటి వరకు 20 కొట్లు పై చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.పేదలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనితెలిపారు..