calender_icon.png 25 June, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ వాతావరణంలో రైతు భరోసా

25-06-2025 01:59:11 AM

రైతులతో కలిసి ముఖ్యమంత్రి సందేశాన్ని వీక్షించిన కలెక్టర్

అదిలాబాద్, జూన్ 24 ( విజయక్రాంతి ): రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంలో భాగంగా ప్రవేశ పెట్టిన రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తు న్న ‘రైతు భరోసా సంబరాలలో భాగంగా రా ష్ట్ర ముఖ్యమంత్రి రైతులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండగ వాతావరణంలో జరుపుకున్నారు.

గుడిహత్నూర్ మండలం సీతగొంది రైతు వేదికను మామిడి తోరణాలతో అలంకరించి పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రి ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా రైతులతో కలిసి హాజరై ముఖ్యమంత్రి సందేశాన్ని వీక్షించారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 49 రైతు నేస్తం,  రైతు వేదికలలో పండుగ వాతావరణంలో 300 మంది రైతులతో పండుగ వాతావరణంలో విజయవం తంగా నిర్వహించడం జరిగింది. రైతు భరో సా పథకం లో భాగంగా 1,63,237 రైతులకి గాను 332.48 కోట్లు  రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు