12 July, 2026 | 4:09 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

వికారాబాద్ జిల్లా కలెక్టర్ కారుపై రాళ్ల దాడి

11-11-2024 01:55 PM

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, తహశీల్దార్ కారుపై రాళ్లు విసిరారు. రైతుల రాళ్ల దాడిలో కలెక్టర్, తహశీల్దార్ కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా కలెక్టర్ రైతులతో చర్చలకు వచ్చారు. అధికారులు లగచర్లకు 2. కిలో మీటర్ల దూరంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఊరి బయట చర్చలకు ఏర్పాట్లు చేయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ తో చర్చల కోసం రైతులు గ్రామసభ వద్దకు రాలేదు. కలెక్టర్ గ్రామసభ వద్ద ఉన్న ఇద్దరు రైతులు అభ్యంతరంతో లగచర్ల గ్రామంలోనే రైతులతో చర్చించేందుకు వెళ్లారు. కలెక్టర్ లగచర్ల గ్రామానికి రాగానే రైతులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ వెనక్కు వెళ్లిపోవాలంటూ కారుపై రైతులు రాళ్లు విసిరారు. దీంతో కలెక్టర్ కారు దిగి రైతులతో చర్చించేందుకు వచ్చారు.