11-11-2025 02:05:24 AM
-రెండు గంటలపాటు ఆందోళన
-కామారెడ్డి జిల్లా పోతంగల్లో ఘటన
కామారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పోతంగల్ మండ లం కోడిచెర్ల మంజీర నది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలి స్తున్న 20 టిప్పర్లను రైతులు సోమవారం అడ్డుకున్నారు. పోతంగల్ రహదారిపై అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ప్రతిరోజు వందలాది టిప్పర్లతో అక్రమంగా మంజీర నది నుంచి ఇసుకను తరలించకపోతున్నారని రైతులు ఆరోపించారు.
ఇసుక మాఫి యా టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించి డబ్బులు చేసి హైదరాబాద్, మహారాష్ట్రకు ఇసుకను తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. ప్రతినెల స్థానిక అధికారులకు ఇసుక దందా నిర్వాహకులు మామూలు ముట్ట జెప్పుతుండటంతో అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైన్స్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అక్రమ ఇసుక దందా నిర్వాహకులతో కుమ్మక్కై ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.