2 May, 2026 | 7:06 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

టీచర్లు, నిరుద్యోగులకు ఒకే టెట్!

11-11-2025 02:04 AM

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): త్వరలోనే విద్యాశాఖ టెట్ నోటి ఫికేషన్‌ను జారీ చేయనుంది. సర్వీసులో ఉ న్న ఉపాధ్యాయులకు కూడా టెట్ నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈసారి అందరికీ ఒకే టెట్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. టీచర్లు, బీఎడ్, డీఎడ్ అభ్యర్థులకు ఒకే టెట్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రతిపాదనలు పంపించారు. దీనిపై ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టీచర్లకు మినహాయింపు కోరుతూ ‘సుప్రీం’లో ఇప్ప టికే ప్రభుత్వం రివ్యూపిటిషన్‌ను వేసింది.