calender_icon.png 5 June, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యాన పంటల సాగుపై రైతు సదస్సు

03-06-2025 08:58:24 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఉద్యాన పంటల సాగుపై మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రంలో రైతులకు ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధి సంస్థ న్యూఢిల్లీ ఆర్థిక సౌజన్యంతో, జేవిఆర్ ఉద్యాన పరిశోధన స్థానం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జేవిఆర్ ఉద్యాన పరిశోధన స్థానం మల్యాల, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్తలు మిరప, పసుపు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వచ్చిన పసుపు పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ బి.మహేందర్ తెలంగాణలో అధిక దిగుబడి ఇచ్చే అధిక కుర్కుమిన్ కలిగిన పసుపురకాల గురించి, వాటి నారు మడి తయారీ, చీడపీడల నిర్వహణ గురించి, ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. మిరప సాగులో రకాల ఎంపిక, మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు శాస్త్రవేత్త ప్రశాంత్ వివరించారు.  ఈ కార్యక్రమంలో పసుపు మిరప సాగుకు సంబంధించిన సమాచారంతో కూడిన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న, శాంతి ప్రియ, ఉద్యాన కళాశాల మల్యాల అసోసియేటెడ్ డాక్టర్ వెంకటలక్ష్మి, ప్రొఫెసర్లు పరమేశ్వర్, అశోక్ రైతులు పాల్గొన్నారు.