calender_icon.png 5 June, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోలులో పెద్దపల్లి జిల్లా మొదటి స్థానం

03-06-2025 09:02:46 PM

కొనుగోళ్లలో హరీష్ రావు, కేటీఆర్, కవిత రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు..

బీజేపీ కూడా రైతుల పై మాట్లాడటం చూస్తుంటే విడ్డురంగా ఉంది..

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు..

పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఆర్. కె గార్డెన్స్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు(MLA Vijaya Ramana Rao) మీడియా సమావేశంలో మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా వడ్ల కొనుగోలు 329 కేంద్రలను ప్రారంభించగా ఇప్పటి వరకు 328 కేంద్రాలల్లో వడ్ల కొనుగోలు పూర్తి చేశామని, మొత్తం 3,96,805.664 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు, అందులో దొడ్డురకం వడ్లు 3,19,717.124 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయగా సన్నరకం వడ్లు 77,088.540 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందని, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 58603 మంది రైతులకు అమ్మిన ధాన్యం విలువ రూ. 915.98 కోట్ల రూపాయలకు గాను ఇప్పటి వరకు రైతులకు రూ. 855.02 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలల్లో కాంగ్రెస్ సర్కార్ జమ చేయడం జరిగిందని, మొత్తానికి 93% చెల్లింపులు జరిగిందని, దానితో పాటు జిల్లా వ్యాప్తంగా సన్న రకం వడ్లకు బోనస్ రూ.38.54 కోట్ల రూపాయలు త్వరలో రైతుల ఖాతాలాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.

పెద్దపల్లి నియోజకవర్గ  వ్యాప్తంగా 178 వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా అన్ని కేంద్రాలలో కొనుగోలు పక్రియ పూర్తి చేసుకొని మొత్తం  నియోజకవర్గ వ్యాప్తంగా 2,16,982.660 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, అందులో దొడ్డురకం వడ్లు 1,54,654.960 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయగా సన్నరకం వడ్లు 62,327.700 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని  కొనుగోలు చేశామని, నియోజకవర్గ వ్యాప్తంగా 31,869 మంది రైతులు అమ్మకాలు జరిపిన విలువ రూ. 501.66 కోట్ల రూపాయలు అయితే ఇప్పటి వరకు రూ. 462.75 కోట్ల రూపాయలు  రైతుల ఖాతాలల్లో జమ చేయడం జరిగిందని, మొత్తంగా 92% చెల్లించడం గర్వకారణం అని, అలాగే పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా సన్న రకం వడ్లకు బోనస్ రూ. 31.16కోట్ల రూపాయలు త్వరలో రైతుల ఖాతాలల్లో జమ చేయడం జరుగుతుందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 -2023 సీజన్లో రైతులకు చెల్లించిన డబ్బులు ఇదే సమయానికి 24% మాత్రమే అన్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో దాన్యం కొనుగోలులో వేగవంతం చేస్తూ ఎప్పటికప్పుడు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తూ 93 శాతం చెల్లింపులు పూర్తి చేసామని అన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా ఐకేపీ, సింగిల్ విండో కేంద్రాల ద్వారా కొనుగోలు పూర్తి చేశాం అని గుర్తు చేశారు.  తెలంగాణ రాష్ట్రానికి పెద్దపల్లి జిల్లా రైతుల ఖాతాలో వేగంగా డబ్బులు జమ చేసి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రైతులను మోసం చేసిన పార్టీ బి.ఆర్.ఎస్ పార్టీ అన్నారు. రైతులను రాజు చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని కొంత మంది బి.ఆర్.ఎస్, బీజేపీ పార్టీ నాయకులు వ్యవసాయం అంటే తెలియని వారు కూడా రైతుల విషయంపై మాట్లాడడం చూస్తుంటే విడ్డూరంగా ఉందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ రైతుల ఇచిన మాట ప్రకారం అకాల వర్షాలతో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో నాతో పాటు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  ఎప్పటికి అప్పుడు అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, తెలంగాణ రాష్టానికి పెద్దపల్లి జిల్లా ఆదర్శంగా నిలిచిందని పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వడ్లు తడిచిన & రంగు మారిన కటింగ్ లేకుండా ధాన్యన్ని కొనుగోలు చేపించడం జరిగిందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి కమిషనర్ చౌహాన్ తో మాట్లాడించి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో పంటలు ఆలస్యంగా పండటం జరుగుతుందని, కావున సన్నధాన్యనికి బాయిల్డ్ ఇవ్వాలని కోరి, అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తో మాట్లాడి సన్నధాన్యన్ని బాయిల్డ్ చేయాలని ఒప్పించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై  సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్లు నమ్మకంతో ఉన్నారని, కాబ్బట్టే సన్నధాన్యనికి బాయిల్డ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లు  ఈర్ల స్వరూప, మినుకాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్లు ఆళ్ల సుమన్ రెడ్డి, చింతపండు సంపత్, రాంచంద్రరెడ్డి, కుర్రమల్ల రెడ్డి,నూగిల్లా మల్లన్న, భూత గడ్డ సంపత్, సయ్యద్ మస్రుత్, మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ధనాయక్ దామోదర్ రావు, అరె సంతోష్, సమా రాజేశ్వర్ రెడ్డి చిలుక సతీష్, బొజ్జ శ్రీనివాస్,బొంకురి అవినాష్, బొడ్డుపల్లి శ్రీనివాస్, జడల సురేందర్,జగదీష్, అస్లాం, తూముల సుభాష్, తిరుపతి రావు,నాంసాని శ్రీనివాస్, వెంకటేష్, మహేష్, రెడ్డి రజినీకాంత్, కర్ణాకర్ డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.