calender_icon.png 25 June, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల పెట్టుబడికి రైతు భరోసా నిధులు

24-06-2025 07:51:16 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..

నిర్మల్ (విజయక్రాంతి): మంగళవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో జరిగిన రైతు భరోసా సంబరాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతులతో మాట్లాడారు. హైదరాబాదులోని రైతు నేస్తం వేదిక నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ గ్రామీణ మండలంలోని న్యూ పోచంపాడ్ గ్రామ రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని రైతులతో కలిసి వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... రైతు భరోసా పథకం ద్వారా విత్తనాలు, ఎరువులు, యాంత్రికరణ పనుల కోసం అవసరమైన పెట్టుబడి సహాయం అంది రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని 1 లక్ష 85 వేల 116 మంది రైతుల ఖాతాల్లో 260 కోట్ల 80 లక్షల నిధులు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, తహసిల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానన్, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.