29-06-2025 12:46:28 AM
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా రామడుగు లక్ష్మణ్ కు రామకృష్ణాపూర్ సిపిఐ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్,పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. శనివారం కార్యాలయంలో నిర్వహించిన పట్టణ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ పట్టణంలో అర్హులైన పేద ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారులు డబుల్ బెడ్రూం ఇళ్లును వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. క్యాతన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీద లైట్లు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నరని సంబంధిత అధికారులు వెంటనే వీధిదీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో స్మశాన వాటిక ఏర్పాటు కూడా త్వరగా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వనికి సూచించారు.