1 June, 2026 | 2:33 PM

Breaking News

ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కుల విషయం   •   బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..   •   డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం   •   విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి   •   నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు   •   రామంతాపూర్‌లో RTC బస్సును ఢీకొట్టిన కారు   •   పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ   •   ఆయిల్ పామ్ నర్సరీలో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేయాలి   •   అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క   •   BRS నేతల ముందస్తు అరెస్టులు.. అప్రజాస్వామికం   •  

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

13-04-2026 09:04 PM

కేంద్రాన్ని  ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మధిర మెప్మా ఆధ్వర్యంలో  మార్కెట్ యార్డ్ నందు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాతతో కలిసి ప్రారంభించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు న్యాయం చేయాలని ఉద్దేశంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన తెలిపారు.

రైతుకి నష్టం కలిగించకూడదని రైతుని రాజు చేయాలని ఉద్దేశంతో రైతులకు మేలు కల్పించడం లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గార్ల చొరవతో ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ కోనా ధని కుమార్ మున్సిపల్ కమిషనర్ సంపత్, 22వ వార్డు కౌన్సిలర్ నాగార్జున  కాంగ్రెస్ నాయకులు రామనాథం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.