17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నిర్లక్ష్యంవహిస్తే రైతులు మరో పోరాటానికి సిద్ధం

26-03-2025 12:40 AM

- హన్వాడ మండల పరిధిలోని నాయినోనిపల్లి గ్రామంలో  వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్ మార్చి (విజయ క్రాంతి) : నిర్లక్ష్యం వహిస్తే రైతులు మరో పోరాటానికి సిద్ధమవుతారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హన్వాడ మండల పరిధిలోని నాయినోనిపల్లి గ్రామంలో  వడగండ్ల వాన కు దెబ్బతిన్న పంటలను ప్రత్యేకంగా పరిశీలించి రైతులతో మాట్లాడారు.

వడగండ్ల వానతో రైతుల చేతికి వచ్చిన పంట చేజారిపోయిందని, తీర నష్టం వాటిల్లిందని ఎకరా కు 40,000 చొప్పున నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశంలో మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతుల కష్టాలు తెలుస్తాయని చెప్పారు.

అనంతరం ఇటీవల మరణించిన పెద్దదర్పల్లి బీఆర్‌ఎస్ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు తేజ వర్ధన్ నానమ్మ కుటుంబ సభ్యులను, హైదరాబద్ లో చెత్త తరలిస్తూ ఉండగా పేలి మృతి చెందిన నాగన్న కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించి ధైర్యం చెప్పారు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, రైతు కమిటీ అధ్యక్షులు కొండ లక్ష్మయ్య, సీనియర్ నాయకులు నెత్తికొప్పుల శ్రీను, చెన్నయ్య, జంబులయ్య, పెద్ద చెన్నయ్య, రాజుయాదవ్, అనంత రెడ్డి , బాలకిష్టయ్య, హరీష్ చందర్, వెంకన్న, మాధవులు,  శ్రీనివాసులు, వెంకటయ్య, తిరుపతయ్య, బలవర్దన్ , రామకృష్ణ తదితరులు ఉన్నారు.