రైతు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
గోపాలపేట మే 12; తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై రైతులు పలు అంశాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయమూర్తి రజిని, లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అసిస్టెంట్ రఘు అన్నారు. సోమవారం గోపాలపేట మండల కేంద్రంలో జిల్లా న్యాయవిజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతుంది,
అందులో భాగంగా వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకొని భూభారతి చట్టాన్ని ప్రారంభించారన్నారు. ఈ చట్టంలో సాదా బై నామలకు పరిష్కార మార్గాలు చూపిస్తుందని దీనితో పాటు సెక్షన్ 15(8) రూల్ 16- ప్రకారం రైతులు ఉచిత న్యాయ సాయం కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఉచిత న్యాయం పొందవచ్చని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గోపాల్ పేట రెవిన్యూ తహసీల్దార్ పాండు నాయక్ గారు ఎం.ఆర్.ఐ యాదయ్య, శేషయ్య, శ్రీదేవి, రెవెన్యూ సిబ్బంది మరియు మండల ప్రజలు పాల్గొన్నారు.






