17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రైతు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

13-05-2025 12:15 AM

గోపాలపేట మే 12; తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై రైతులు పలు అంశాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయమూర్తి రజిని, లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అసిస్టెంట్ రఘు అన్నారు. సోమవారం గోపాలపేట మండల కేంద్రంలో జిల్లా న్యాయవిజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు.  తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతుంది,

అందులో భాగంగా వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకొని భూభారతి చట్టాన్ని ప్రారంభించారన్నారు.  ఈ చట్టంలో సాదా బై నామలకు పరిష్కార మార్గాలు చూపిస్తుందని దీనితో పాటు సెక్షన్ 15(8) రూల్ 16- ప్రకారం రైతులు ఉచిత న్యాయ సాయం కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఉచిత న్యాయం పొందవచ్చని  తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గోపాల్ పేట రెవిన్యూ తహసీల్దార్ పాండు నాయక్ గారు ఎం.ఆర్.ఐ  యాదయ్య, శేషయ్య, శ్రీదేవి, రెవెన్యూ సిబ్బంది మరియు మండల ప్రజలు పాల్గొన్నారు.