30 June, 2026 | 9:03 PM

Breaking News

ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •  

పెద్దమ్మతల్లి ఆలయంలో వైభవంగా చండీ హోమం

13-05-2025 12:13 AM

భద్రాద్రి కొత్తగూడెం, మే 12, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేపీ జగన్నాధపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మతల్లి) లో సోమవారం చండీ హోమం వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలతో వేదమంత్రాలతో అమ్మవారి ఉత్సవ విగ్రహాలను దేవాలయం నుంచి వేగశాలకు తీసుకువచ్చి మండపారాధన గణపతి పూజలు నిర్వహించారు. అనంతరం చండీ హోమం చివరన పూర్ణహోతి కార్యక్రమం నిర్వహించారు.ఈ హోమంలో 17 దంపతులు పాల్గొన్నారు. 

అర్చకులు వేద పండితులు చండీ హోమంలో పాల్గొని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్ రజిని కుమారి పాలకమండలి చైర్మన్ బాలునేని నాగేశ్వరరావు ధర్మకర్తలు చీకటి కార్తీక్ అడుసు మల్లి సాయిబాబు పెండ్లి రాంరెడ్డి,భూక్య గిరిప్రసాద్, చెవుగాని పాపారావు, చెరుకూరి శేఖర్ బాబు, సందుపట్ల రమ్య, శనగారపు శ్రీనివాసరావు, దుగ్గిరాల సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు.