calender_icon.png 16 October, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు పాడిపరిశ్రమపై దృష్టి సారించాలి

16-10-2025 02:25:31 AM

  1. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

200 యూనిట్ల పాడి గేదెలు ఇప్పటికే పంపిణీ చేశాము

కోనరావుపేట మండలం పల్లిమక్తలో గాలికుంటు నివారణ టీకాల పంపిణీ

హాజరైన కలెక్టర్ ఎం హరిత

కోనరావుపేట, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా లో కోనరావుపేట మండలం, రైతులు పాడి పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోనరావుపేట మండలం పల్లిమక్తలో బుధవారం నిర్వహించగా,ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ ఎం. హరిత హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు.

రైతులు వ్యవసాయంతోపాటుగా పాడి పశువుల పెంపకంపై దృష్టి సారించాలని సూచించా రు. దీంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సబ్సిడీ పై 200 యూనిట్ల గేదెలను రైతులకు ఇటీవల పంపిణీ చేశామని గుర్తు చేశారు. పశు సంపదను కాపాడితే రైతుకు ఎంతో మేలు చేకూ రుతుందని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న రైతులకు పశువులు పంపిణీ చేస్తామని పే ర్కొన్నారు.

మధ్య మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు పాడి పరిశ్రమ కింద ఉపాధి కల్పించేందుకు ఇటీవల ఆ శాఖ మంత్రిని కలిశామని వివరించారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని విప్ తెలిపారు.రైతును రాజు చేయ డమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని విప్ తెలిపారు. సాగుకు అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తున్నామని పే ర్కొన్నారు.

రైతులకు ఇబ్బందులు కలుగకుం డా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మల్కపేట రిజర్వాయర్ పనులు పూర్తి చేసి, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట మం డలాలకు సాగు నీరు అందించి పంటలను కాపాడమని గుర్తు చేశారు. ఈ ఏడాది రిజర్వాయర్ లో రెండు టీఎంసీల నీటిని నిలువ ఉంచామని, వచ్చే ఏడాది మూడు టీఎంసీల నీటిని నిలువ పెట్టనున్నామని పేర్కొన్నారు.

కాలువలు పూర్తి చేసి కోనరావుపేట మండలంలోని దాదాపు పది గ్రామాలకు సాగునీ టిని అందించామని గుర్తు చేశారు. మల్కపేట కు రూ. 12 కోట్ల బిల్లులు చెల్లించామని తెలిపారు.రుద్రంగి కలికోట సూరమ్మ చెరువుకు రూ. 75 కోట్లు మంజూరు చేయగా, పనులు వేగంగా ముందుకు వెళ్తున్నాయని విప్ వెల్లడించారు. నాగారానికి రోడ్డు వేయించామని, పల్లిమక్తలో రూ. 1 కోటి 50 లక్షలతో రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. 

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ ఎం. హరిత

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ ఎం హరిత పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటుగా రైతులు అనుబంధంగా పశువులను పెంచుకోవడంతో ఆర్థికంగా మేలు చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వపరంగా అర్హులైన రైతులకు పశువులు, కోళ్లు ఇతర జీవాలను ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు.

గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా ప్రభుత్వం టీకాలు పంపిణీ చేస్తుందని వెల్లడించారు. పశువుల పెంపకందా రులు తమ గ్రామాల్లో పశువైద్యాధికారులు నిర్వహించే శిబిరాలకు జీవాలను తీసుకెళ్లి టీకాలు వేయించాలని సూచించారు.

పశువులు ఉండే పరిసరాలు నిత్యం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని దీంతో అవి ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు పశువుల పెంపకం దారులు ఏటా అందజేసే టీకాలను జీవాలకు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య,వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్ర భాకర్, ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య , తహసీల్దార్ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.