12 May, 2026 | 10:54 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

రైతులు డ్రోన్లను వినియోగించుకోవాలి

27-11-2024 01:44 AM

వ్యవసాయ శాఖ సంచాలకులు గోపీ  

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): కూలీల కొరత ప్రధాన సమస్యగా మారిన తరుణంలో దాని ని అధిగమించేందుకు  డ్రోన్లను వినయోగించుకోవాలని రైతులకు  వ్యవ సాయ సంచాలకులు గోపీ సూచించారు. మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్ల వాడకం, జీరో టిల్లేజీ విధానంలె మొక్కజొన్న సాగుపై అవగాహన కల్పించారు.

డ్రోన్లు ద్వారా ఒక ఎకరంలో  విత్తనాలు నాటేందుకు 5-6 కేజీల విత్తనం సరిపోతుందన్నారు. పురుగు మందుల పిచికారీలో  ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. జీరో టిల్లేజీ విధానంలో మొక్కజొన్నసాగుతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చింతకాని మండలంలో బసవపురం, రాఘవాపుర, రామకృష్ణాపురంలో 100 హెక్టార్లలో ఈ పద్ధతిలో  మొక్కజొన్న సాగును  ప్రయోగాత్మకంగా  ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. ఈ విధానంలో  మొక్కజొన్న సాగు  చేస్తున్న చింతకాని మండలం నుండి అభ్యుదయ రైతు నరసింహ రావు తన అనుభవాలను పంచుకొన్నారు. కార్యక్రమంలో 566 రైతు వేదికల నుంచి జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.