27-05-2025 01:14:11 AM
- అన్నదాతలపై పగబట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
- మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజం
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు చేయా లని అడిగిన రైతులపై పోలీసులు దాష్టీకం చేశారని బీఆర్ఎస్ ఎమ్మె ల్యే హరీశ్రావు ఆరోపించారు.
రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టి నట్టు వ్యవహరిస్తోందని సోమవారం ఎక్స్ వేదికగా సీఎం రేవం త్రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ను ట్యాగ్చేస్తూ పోస్ట్ చేశారు. రైతులకు బీమా కూడా లేకుండా చేసిందని, పంట కొనుగోళ్లు ఆలస్యం చేసిందని హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు బేడీలు వేశారన్నారని మండిపడ్డారు.
ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో సాధించిన ఘనత ఇదని విమర్శించారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదని, సీఎం రేవంత్రెడ్డి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హరీశ్రావు హితవు పలికారు.