calender_icon.png 30 May, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదోడి సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం

27-05-2025 01:16:36 AM

- చురుగ్గా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు 

- ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులే నిర్మాణకర్తలు

- ఇప్పటి వరకు రూ.68 కోట్లు దాటిన చెల్లింపులు

- రాష్ట్ర రావెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

- ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ 

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): -పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల  నిర్మాణపనులు చురుకుగా సాగుతున్నాయని, త్వరలో గృహ ప్రవేశాలు కూడా చేసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. 

పేదింటి ఆడపడుచుల ఆహ్వానాన్ని స్వీకరించి వీలైన చోట్ల గృహ ప్రవేశానికి వెళ్తానని మంత్రి పొంగులేటి చెప్పారు. సోమవారం సచివాలయం నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ నెల 19 నుంచి 25 వరకు వివిధ దశల్లో పూర్తయిన ఇంటి లబ్ధిదారులకు రూ.14.44 కోట్లు విడుదల చేశామన్నారు.

పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇండ్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు ఇందులో 7,824 ఇండ్లు బేస్‌మెంట్, 895 ఇండ్లు గోడల నిర్మాణం వరకు మరో 64 ఇండ్లు శ్లాబుల వరకు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. గత సోమవారం మే 19 తేదీనాటికి బేస్‌మెట్  పూర్తయిన 5,140 ఇండ్లకు రూ.51.40 కోట్లు అందజేశామన్నారు.

రాష్ర్టంలో ఇంతవరకు బేస్‌మెంట్ పూర్తయిన 5,682 ఇండ్ల కు రూ.లక్ష చొప్పున రూ. 56.82 కోట్లు, గోడలు పూర్తి అయిన 497 ఇండ్లకు రూ. 2 లక్షల చొప్పున రూ.9.94 కోట్లు, స్లాబు పూర్తయిన 33 ఇండ్లకు 4 లక్షల చొప్పున రూ.1.32 కోట్లు విడుదల చేశామన్నారు. మొత్తం గా ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.68.08 కోట్లు అందజేశామని మంత్రి  తెలిపారు