ఉగాది నంది పురస్కారాలు అందుకున్న తండ్రి, కూతురు
నిర్మల్, మార్చి 2 (విజయక్రాంతి): ‘ప్రేమతో నాన్న’ లఘు చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటినటులుగా డాక్టర్ సుహాసిని, డాక్టర్ వేణుగోపాలకృష్ణ నంది పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్ బిర్లా ఆడిటోరి యంలో ఆదివారం మెగా ఎంట్ర్పజెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ సుహాసిని, డాక్టర్ ణుగోపాలకృష్ణలకు అందజేశారు. ప్రేమతో నాన్న మొదటి భాగానికి కూడా ఇదివరకే ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు.
చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణతో పాటు మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నాయకులు నిర్మల్ మాజీ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ వేణుగోపాలకృష్ణచారితో పాటు టీవీ సినీ కళాకారులు అల్లం అనిల్, సభ్యులు శిరీష రెడ్డి, రుద్ర శ్రీనివాస్, పాల్గొని సుహాసిని, వేణుగోపాలకృష్ణకు నంది పురస్కారాలు అందజేశారు.




