16-06-2025 10:24:59 PM
టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు జూనియర్ కళాశాలలో 50 శాతం ఫీజు రాయితీని కల్పించాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం(Telangana State Union of Working Journalists Association) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో డీఐఈఓ కళ్యాణిను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... పేద మధ్యతరగతి వర్గాల వారే ఎక్కువమంది జర్నలిస్టులు ఉన్నారని చెప్పారు. సంగారెడ్డిలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం రాయితీ కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్ , టియుడబ్ల్యూజే నాయకుడు నగరారే తారు , రాధాకృష్ణా చారి, ఏజస్ తదితరులు పాల్గొన్నారు.