16-06-2025 10:22:53 PM
సీఎంకు ధన్యవాదాలు చెప్పిన మహిళా రైతు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహబూబాబాద్ మండలం జమండ్లపల్లి చంద్రు తండాకు చెందిన అజ్మీర ద్వాలీ అనే మహిళ రైతుతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడి తను సాగు చేస్తున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ద్వాలీ మాట్లాడుతూ... తనకు ప్రభుత్వం ద్వారా రుణమాఫీ కింద లక్ష 65 వేల 509 వేల రూపాయలు మాఫీ అయ్యిందని, రైతు భరోసా కింద 12 వేలు తన ఖాతాలో జమ జమ చేయడం వల్ల హ్యాపీగా ఉన్నాం సార్, థాంక్యూ సార్ అంటూ సంతోషంతో మాట్లాడగా ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులకు కూడా ధన్యవాదాలు చెప్పాలంటూ నవ్వుతూ పేర్కొనగా ఆమె అందరికీ కృతజ్ఞతలు సార్ అంటూ చెప్పారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా తనతో మాట్లాడడంతో ద్వాలి తెగ సంబరపడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ కే.వీరబ్రహ్మచారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఎం.విజయనిర్మల, జిల్లా హార్టికల్చర్ అధికారి జి.మరియన్న, ఏవో ఎన్.తిరుపతి రెడ్డి, ఆయిల్ ఫెడ్ మెంబర్ కృష్ణారెడ్డి, స్థానిక తహసిల్దార్ రాజేశ్వరరావు, రైతులు సత్తిరెడ్డి, రవి, బుచ్చిరెడ్డి, సిబ్బంది పూజిత, సాయి ప్రకాష్, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని వివిధ గ్రామాల్లోని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.