17 April, 2026 | 8:33 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

08-04-2025 12:17 AM

కరీంనగర్, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిల విడుదల లేదని  ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజు బకాయిల విడుదల చేయకపోవడానికి ప్రభుత్వంకి ఎందుకంత నిర్లక్ష్యమని అన్నారు.

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడవద్దని అన్నారు. యూనివర్సిటీల భూములను అమ్మాలని చూస్తే ప్రభుత్వంపై తీవ్ర తిరుగుబాటు తప్పదని, ప్రైవేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేస్తే ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులు చేస్తామని  హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, నగర నాయకులు సందీప్ రెడ్డి, అశోక్, పవన్, వినయ్ రెడ్డి, రాజేష్ పాల్గొన్నారు