7 July, 2026 | 3:48 PM

Breaking News

అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •  

పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు

07-07-2026 02:37 PM

– రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్

ముకరంపుర,(విజయక్రాంతి): నీటి పారుదల శాఖ ఇంజనీర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన చొల్లేటి బుచ్చిరెడ్డి సన్మాన సభ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఉద్యోగుల సమక్షంలో  జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, చొల్లేటి బుచ్చిరెడ్డి ఉద్యోగానికి మాత్రమే పదవీ విరమణ పొందారని, వారి సేవా తపనకు, నిజాయితీకి, మానవీయ విలువలకు పదవీ విరమణ ఉండదన్నారు. జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టి ఎన్‌జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఇరిగేషన్ ఇంజనీర్ కేవలం కాలువలు నిర్మించే అధికారి కాదని, రైతు ఆశలను సాకారం చేసి వేలాది కుటుంబాల జీవితాల్లో సంతోషాన్ని నింపే మహోన్నత శిల్పి అని అన్నారు.