24 August, 2026 | 10:34 PM

Breaking News

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •  

తొలి, మలి ఉద్యమకారున్ని పరామర్శించిన తోటి ఉద్యమకారులు

18-06-2025 08:27 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తొలి మలి ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించి 1969 తెలంగాణ ఉద్యమ పోరాట సమితి స్థాపనలో ముఖ్య నాయకుడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ఒలీ బాబా గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎం ఒలి బాబాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొల్లపల్లి దయానంద్, పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణ బోయిన నరసయ్య ముదిరాజ్, కాకెల్లిసైమన్, హరి గోపాల్, గిరీశం, మల్లేష్, బాల్రాజ్ లు బుధవారం పరామర్శించి శాలువతో సత్కరించారు.

త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని భగవంతుని ప్రార్థించారు. ఈ సందర్భంగా శ్రావణ బోయిన నరసయ్య ముదిరాజ్ మాట్లాడుతూ... ఉద్యమకారుల పుణ్యమా అంటూ నాయకులు పాలకులై ఉద్యమకారులను బిచ్చగాళ్ళుగా చేసిన వైఖరిని సమాజం ఉద్యమకారులు ఎన్నడూ క్షమించరని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారులకు తగిన న్యాయం చేస్తారని ఆశించారు.