calender_icon.png 2 June, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

31-05-2025 10:52:50 PM

బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి...

బాన్సువాడ (విజయక్రాంతి): పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి(DSP Vittal Reddy) ప్రజలకు సూచించారు. బక్రీద్ సందర్భంగా శనివారం రాజకీయ పార్టీ నాయకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సుహృద్భావ వాతావరణంలో పండగలు జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ అశోక్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు కాలెక్, వహాబ్, ఎజాజ్, ఆలీ తదితరులు పాల్గొన్నారు.