31-05-2025 10:52:50 PM
బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి...
బాన్సువాడ (విజయక్రాంతి): పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి(DSP Vittal Reddy) ప్రజలకు సూచించారు. బక్రీద్ సందర్భంగా శనివారం రాజకీయ పార్టీ నాయకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సుహృద్భావ వాతావరణంలో పండగలు జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ అశోక్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు కాలెక్, వహాబ్, ఎజాజ్, ఆలీ తదితరులు పాల్గొన్నారు.