20 June, 2026 | 7:16 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

రైతు భరోసాపై క్షేత్ర పర్యటన

06-07-2024 01:37 AM
  1. 11 నుంచి 16 వరకు జిల్లాల్లో టూర్లు
  2. రైతులు, నిపుణులతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు
  3. ఆ తర్వాతే పథకం విధివిధానాలు ఖరారు
  4. సచివాలయంలో ఉపసంఘం భేటీ.. పథకంపై చర్చ

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): రైత భరోసా పథకంపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు జిల్లాలకు వెళ్లి రైతులు, నిపుణులతో చర్చించనున్నారు. రైతు భరోసాపై ఏర్పాటైన క్యాబినెట్ కమిటీ శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు , పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  ఈ పథకంపై చర్చించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రైతుభరోసా విధివిధానాలు, అర్హతలను ఖరారు చేయాలని ఉపసంఘం అభిప్రాయపడింది. కౌలు రైతులకు రైతు భరోసా ఎలా ఇవ్వాలనే అంశంపై కూడా రైతు సంఘాలు, నిపుణులతో చర్చంచనున్నారు. ఈ నెల 16న మరోసారి సమావేశమై విధివిధానాలు ఖరారు చేసి అసెంబ్లీలో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.