04-06-2025 12:14:45 AM
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, జూన్ 3 (విజయ క్రాంతి): నిరుపేదలందరికి ఇండ్లు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ, నియోజకవర్గం, వర్ని మండల కేంద్రం లో లోని CCౄ ఫంక్షన్ హాల్ లో వర్ని, చందూర్, మోస్రా, రుద్రుర్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను ఆయన పంపిణీచేశారు.
వర్ని మండలంకు 425 మంది, చందూర్ మండలం కు 94 మంది, మోస్రా మండలంకు 96 మంది, రుద్రూర్ మండలంకు 188 మందికి మొత్తం 803 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసి,ఇళ్ల నిర్మాణం పైన అవగాహన కల్పించిన పోచారం శ్రీనివాసరెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన వారు ముందుకు వస్తె ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.