26-05-2025 01:46:47 AM
నిజామాబాద్, మే 25, (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలో గల ఒక ప్రముఖ రెస్టారెంట్లో ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఎప్పుడు రద్దుగా ఉండే ఈ అల్పాహార కేంద్రంలో వంటగదిలో నుండి హఠాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది పరుగులు పెట్టారు.
మంటలు చెలరేగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు అగ్ని ప్రమాద కేంద్రానికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి పక్కనే ఉన్న మరో అల్పాహార కేంద్రాన్ని మూసివేశారు అగ్ని ప్రమాదాన్ని గల కారణాలు తెలియ రాలేదు టిఫిన్ సెంటర్ పైన మెస్తోపాటు లాడ్జ్ వసతి ఉండడంతో అక్కడ ఉన్న వారిని వెంటనే ఖాళీ చేయించారు ప్రమాదం జరిగినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.