26-05-2025 01:45:51 AM
రాష్ట్ర అధ్యక్షుడు సామ శ్రీనివాస్
కామారెడ్డి, మే 25 (విజయ క్రాంతి), మలిదశ ఉద్యమకారులకు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షుడు సామ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ లో జరిగిన ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి ఉద్యమకారులు జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సామ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారు లకు ఇచ్చిన హామీలను 2వ తారీకు లోపు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సామ కిరణ్ రెడ్డి బీజేపీ వెంకట్ రెడ్డి జనరల్ సెక్రటరీ పల్లి వినయ్ గారు మరియు బాన్స్ వాడ మలి దశ ఉద్యమకారులు ఉడుత గంగాధర్ గుప్త, గంజివార్ చందు, d భాస్కర్ గౌడ్, కృష్ణ, దత్తు (రాజు ), పవన్, సాయికుమార్, గంగారాం, నగేష్ పాల్గొని ఉద్యమకారుల సమస్యపై చర్చించారు.