20-05-2025 09:48:44 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) షాద్ నగర్ మండలం(Shadnagar Mandal)లోని వాహనాల షెడ్డులో మంగళవారం నాడు అగ్నిప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో కార్లు ,ఇతర వాహనాలు కాలిపోయాయి. వాహనాలకు మంటలు అంటుకుని భారీగా పొగ కమ్మేయడంతో స్థానికులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. షెడ్డులోని ఇండికా కారు బ్యాటరీ పేలి మంటలు చెలరేగినట్లు సిబ్బంది గుర్తించారు. స్థానికుల సమాచారంతో హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.