08-06-2025 12:08:25 AM
శ్మశానవాటిక నుంచి ఎగిరిపడ్డ నిప్పురవ్వలు
జగిత్యాల అర్బన్, జూన్ 7 (విజయ క్రాంతి): జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ దుకాణంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకుని మం టలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. స్క్రాప్ దుకాణం సమీపంలోనే పెట్రోల్ బంక్తో సహా పలు గృహ సము దాయాలు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమీపంలో ఉన్న శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించగా అక్కడి నుంచి గాలికి నిప్పు రవ్వలు ఎగిరి పడిన కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకు న్న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ప్రమాదం జరిగిన తీరును పరి శీలించారు.