17 April, 2026 | 2:48 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

వారంలో చేప పిల్లలు చెరువుల్లోకి

12-10-2025 04:03 AM

సీఎం రేవంత్‌రెడ్డిచే కార్యక్రమ నిర్వహణ 

మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలోని చెరువుల్లో చేపపిల్లలు వదలడంపై మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ వారం రోజు ల్లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. అందు కు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి రూ.122 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని మంత్రి గుర్తు చేశారు.

తెలంగాణలోని కృష్ణ, గోదావరి నదులతో పాటు గొలుసుకట్టు చెరువులు కూడా పుష్కలంగా ఉన్నాయన్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ నుంచి చేపపిల్లల పంపిణీ జరిగేలా ఉత్పత్తి చేయాలని, ఆ విధంగా టార్గెట్ పెట్టుకొని పనిచేయాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో చేప పిల్లలను వదలడంలో అక్రమాలు జరిగాయి. ఆ విధంగా జరగకుండా చూసుకోవాలని ఎక్కడైనా అలా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. తాను 32 జిల్లాల్లో ఉన్న చెరువులను సందర్శించడానికి సిద్ధంగా ఉన్నాను.

అందుకు కావాల్సిన రూట్ మ్యాప్ తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు.  ఈ సందర్భంగా అధికారులు 2024-- 25లో 4.77 లక్షల టన్నుల చేపలు, రొయ్యలు ఉత్పత్తి అయ్యాయని, వీటి విలువ రూ.7,460కోట్లు అని మంత్రికి తెలిపారు.ప్రస్తుత 2025- -26లో 3.2 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, సహజ ఉత్పత్తి నుంచి1.98 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించవచ్చని అంచనా వేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో మత్స్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్,డైరెక్టర్ నిఖిల, డీఎఫ్‌ఓలు పాల్గొన్నారు