వలకు చిక్కుకొని మత్స్యకారుడి మృతి
కేసముద్రం, మార్చి 23 (విజయక్రాంతి): చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు వలకు చిక్కుకొని దుర్మరణం పాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణ పల్లి వట్టివాగులో చోటు చేసుకుంది. కేసముద్రం ఎస్ఐ క్రాంతి కిరణ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ పట్టణంలోని హనుమంతుని గడ్డ కు చెందిన అలువాల సాయిబాబా (29) ప్రతిరోజు చేపలు పట్టి అమ్మి జీవించేవాడు.
రోజులాగానే ఆదివారం మధ్యాహ్నం 3.౩౦ గంట లకు అర్పణ పల్లి శివారులోని పట్టి వాగు ఏరు లో వలతో చేపలు పట్టడానికి వెళ్లి వస్తానని తన భార్య ఉమకు చెప్పి మహబూబాబాద్ నుంచి బయలుదేరి అర్పణ పల్లి శివారులోని వట్టివాగువీరులు చేపలు పట్టడానికి వలను వేయగా ప్రమాదవశాత్తు వ ల అతని కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగిపోయి చనిపోయాడన్నారు. మృతునికి కూతురు కారుణ్య కొడుకు కౌశిక్ ఉన్నారు. మృతుడి భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ ఐ తెలిపారు.




