calender_icon.png 17 October, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదు రోజులు వర్షాలు

16-10-2025 02:13:51 AM

-ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ 

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాం తి): రాష్ట్రంలో నేటి నుంచి ఐ దు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ప లు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు సైతం వీస్తాయని తెలిపింది.

గురువారం నిజామాబాద్, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం నిజామాబాద్, ఖ మ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమ కొండ, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తాయని తెలిపింది. సోమవారం వరకు రా ష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురువనున్నాయి.